అన్నజయ్యకు చెప్పిన కాలజ్ఞానం
అన్నజయ్యకు చెప్పిన కాలజ్ఞానం
ఈ కాలజ్ఞానం లోని కొన్ని సంగతులు గతంలో అచ్చమ్మకు చెప్పినట్టుగానే కనబడుతున్నాయి.
ఎంతోమందీ మార్బలం ఉన్న రాజులు కూడా సర్వ నాశనమైపోతారు. గ్రామాల్లో చోరులు పెరిగిపోతారు.
గతంలో జరిగిన యుద్ధాల్లో ఈ పరిణామం సంభవించింది. శ్రీకృష్ణుని నిర్యాణం జరగబోయే ముందు కూడా జరిగినది ఇదే కదా. అర్జునుడు యాదవ స్త్రీలను తీసుకుని వస్తుంటే దారిలో చోరులు అర్జునుడిమీద, అతని సైన్యం మీద దాడి చేస్తారు. వారిమీద తన మహాస్త్రాలను ప్రయోగించ దలచుకున్నప్పటికీ ఒక్క అస్త్రం కూడా గుర్తురాక నిస్సహాయుడైపోతాడు అర్జునుడు. అదంతా కలియుగ ప్రభావమే అని చెప్తాడు వ్యాసుడు.
పిడుగులు పడి నదులు ఇంకిపోయేను...
ఉల్కల వల్ల ఈ పరిణామం సంభవించవచ్చని కొందరి అభిప్రాయం. ఉల్కలు పడిన సమయంలో పిడుగు వంటి శబ్దాలు వస్తాయి. ఉల్కాపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమిమీద తిరుగాడిన మహాకాయులైన డైనోసర్లు తుడిచిపెట్టుకుపోయాయి. చిన్న పిడుగు పడితేనే ఎంతోమంది మనుషులు మరణిస్తున్నారు. అలాంటిది ఉల్క పడితే, ఏ ప్రమాదమయినా సంభవించవచ్చు.
విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్టు, నిల్చున్నవారు నిల్చున్నట్టు హతమారిపోయేరు..
రాత్రింబగళ్ళు గద్దలు గుంపులు కూడి అరుస్తాయి. నీటియండు చేపలు తాము చచ్చేమని తలచి బయటకు వస్తాయి..
పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి, భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమౌతుంది.
శ్రీశైలం శిఖరాన అగ్ని వర్షం పుడుతుంది. నందీశ్వరుడు రంకెలు వేస్తాడు. ఖనఖనమని కాలు దువ్వుతాడు.
సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది.
ఇది పురాణాలలో ఉంది. అశరీరవాణి తరచుగా సత్య నిర్ధారణ చేయడం ఎన్నొ సందర్భాల్లో మనం పురాణాలు, ఇతిహాలాసాల్లో కూడా చదువుకున్నాం. బహుసా అప్పుడు చెప్పిన అశరీరవాణి ఇదే కావచ్చు.
విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు నిండుతుంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాదిమంది ప్రజలు మరణించగా, లక్షలాదిమందికి అనేక రుగ్మతలు కలిగాయి.
గ్రామాలలో, పట్టణాలలో నెత్తుటి వాన కురిసేను..
రక్తం మాదిరిగా ఎరుపు రంగులో వానలు పడటం కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు చూశారు. వివిధ రసాయనాలు, వాతావరణ కాలుష్యం కారణంగా ఎరుపురంగు వర్షం పడుతోందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.
సూర్యుడు, చంద్రుడు ఉన్నంతవరకు నా మఠానికి పూజలు జరుగుతూనే ఉంటాయి. నా మఠానికి ఈశాన్యం వైపు ఒక చిన్నదానికి చిన్నవాడు పుట్టేను.. అతడు ''నేనే భగవంతుడను నన్ను పూజించండి '' అని పలుకుతాడు..
నెల్లూరు సీమ మొత్తం నీట మునిగి ఉంటుంది.
తుఫాను సమయంలో నెల్లూరు మొత్తం జలమయం అవడం అనేక సంవత్సరాలుగా మనకు తెలుసు కదా.